Pithapuramలో రూ.17 కోట్ల బంగారం సీజ్

Telugu BOX Office


దేశం మొత్తం పార్లమెంట్ ఎన్నికల హడావిడి నడుస్తున్నప్పటికి తెలుగు రాష్ట్రాల్లో అందరి చూపు మాత్రం పిఠాపురం వైపే ఉంది. ఇక్కడి నుంచి టాలీవుడ్ హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నానని ప్రకటించినప్పటి నుంచి.. పిఠాపురం పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో సినీ, టీవీ నటులు పవన్ గెలుపు కోసం ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు పవన్‌కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలని వైసీపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది.


ఈ క్రమంలోనే పిఠాపురం నియోజకవర్గంలో డబ్బు ప్రభావం అధికంగా ఉండబోతుంది భావించిన ఎన్నికల అధికారులు, పోలీసులు నిత్యం తనిఖీలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పిఠాపురంలోని గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ మినీ ట్రక్కు‌లో రూ. 17 కోట్ల విలువైన బంగారం, వెండి వస్తువులను అధికారులు గుర్తించారు. వాటికి సరైన పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసి కాకినాడలోని జిల్లా ఖజానాకు తరలించినట్లు తెలిపారు. కాగా వెండి, బంగారం తో పట్టుబడిన వాహనం.. వైజాగ్ నుండి కాకినాడ వస్తున్నట్లు తెలుస్తుండగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Share This Article
Leave a comment