వాళ్లు వేశ్యల కంటే నీచం.. శుభలేఖ సుధాకర్ షాకింగ్ కామెంట్స్

Telugu BOX Office

‘శుభలేఖ’ సుధాకర్.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ఇండస్ట్రీలో ఆయన రాటు తేలిన కేరెక్టర్ యాక్టర్. పాత్రల్లోకి ఇట్టే పరకాయ ప్రవేశం చేసి మార్కులు కొట్టేస్తూ ఉంటారు. నటనతోనే కాదు.. గాత్రంతోనూ ఆయన ప్రేక్షకులను రంజింపచేస్తుంటారు. ఎందరో నటులకు ఆయన డబ్బింగ్ చెప్పారు. ముఖ్యంగా కేజీఎఫ్ సినిమా హీరో యశ్ చరిత్ర గురించి చెబుతూ ఎలివేషన్ ఇచ్చే తాతకు శుభలేఖ సుధాకరే డబ్బింగ్ చెప్పారని చాలామందికి తెలియకపోవచ్చు. మధుర గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెల్లెలు ఎస్పీ శైలజకు ‘శుభలేఖ’ సుధాకర్ భర్త..

తాజాగా యాత్ర -2 చిత్రంలో రెడ్డి పాత్రలో ఆయన నటనకు వంద మార్కులు పడ్డాయి. సినిమా చూసిన ప్రేక్షకులు ఆయన పాత్రను మరిచిపోవడం కష్టం.. అంతలా ప్రేక్షకులను మెప్పించారని చెప్పవచ్చు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పలు యూట్యూబ్‌ ఛానల్స్‌ తన పట్ల వ్యవహిరిస్తున్న తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తప్పుడు థంబ్‌నైల్స్‌ పెట్టి పలు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన ఎమోషనల్‌ అయ్యారు. ‘సుధాకర్‌కు అపాయింట్‌మెంట్‌ ఇవ్వని చిరంజీవి… శైలజతో విడాకులు తీసుకున్న సుధాకర్‌ ఇలా తప్పుడు రాతలు ఎందుకు రాస్తారంటూ ఆయన ఆవేదన చెందారు.

సుధాకర్ ఆవేదన ఆయన మాటల్లోనే… ‘చిరంజీవితో నాకు మంచి సాన్నిహిత్యం ఉంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అనారోగ్యంతో ఉన్నప్పుడు 54రోజుల పాటు ఆయన నిత్యం ఫోన్‌ కాల్‌ చేస్తూనే ఉన్నారు. ఆయన ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకునే వారు. మెగాస్టార్‌ నా మొదటి హీరో.. ఈ యూట్యూబ్‌ వాళ్లు చాలా ఏళ్లుగా తప్పుగానే నా గురించి చూపిస్తూ వస్తున్నారు. నేను, శైలజ విడిపోయామని పలు వీడియోలు కూడా పెట్టారు.. అందులో నిజం లేదని ఇప్పటికే మేము ఇద్దరం కలిసి చెప్పాం’ అని చెప్పుకొచ్చారు.

ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు మా అమ్మ గారు శైలజను ఒకరోజు ప్రశ్నించారు. ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా..? అని అప్పుడు నేను కలుగచేసుకుని అలాంటివి ఏమీ లేవని చెప్పాను. తర్వాతి రోజు నిద్రలోనే ఆమె మరణించారు. ఇలాంటి సమయంలో నేను ఏం అనుకోవాలి..? ఇలాంటి వీడియోలతో యూట్యూబ్‌ ఛానల్స్‌ వారికి ఏమి కలిసి వస్తుంది..? ఈ ప్రపంచంలో అతి నీచమైన వృత్తి అంటే ఒక స్త్రీ తన శరీరాన్ని అమ్ముకుని డబ్బలు సంపాదించడమే.. కానీ వాళ్లకు కూడా మంచి ఎథిక్స్‌ ఉంటాయి. కానీ తప్పుడు రాతలు రాసేవాళ్లకు మాత్రం ఎలాంటి ఎథిక్స్ ఉండవంటూ సుధాకర్ కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఒక్కోసారి శుభలేఖ సుధాకర్ చనిపోయారని వీడియో పెడతారు.. నన్ను చంపేస్తే వాళ్లకు ఏం కలిసి వస్తుంది. అలాంటి వారికి నేను ఏం ద్రోహం చేశాను. కనీసం నేను ఎవరినీ కూడా ఇబ్బంది పెట్టను. మీ పొట్ట నింపుకోవాడానికి మరోకరిని ఇలా చంపడం ఎందుకు..? అలా సంపాదించిన డబ్బుతో తిన్న ఆహారం ఒంటికి పడుతుందా..? ఇలాంటి వీడియోలు చేసేవారు నూటికి వెయ్యి శాతం అనుభవిస్తారు.’ అని ఆయన క్షోభించారు. శుభలేక సుధాకర్ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

Share This Article
Leave a comment