కార్తీక మాసంలో ఈ తప్పులు అస్సలు చేయొద్దు

Telugu BOX Office

హిందూ పంచాంగం ప్రకారం, దీపావళి ముగిసిన తర్వాత పాడ్యమి రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసం పరమేశ్వరునికి, విష్ణుమూర్తి, లక్ష్మీదేవికి అంకితమివ్వబడింది. ఈ మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని అనేక పురాణ గ్రంథాలలో పేర్కొనబడింది. ఈ మాసంలో శివాలయాలు, విష్ణుమూర్తి ఆలయాలన్నీ భగవంతుని నామస్మరణతో మారుమ్రోగుతాయి.

ఈ సందర్భంగా ఈ పవిత్రమైన మాసంలో ఉపవాసం ఉండేవారు, వ్రతాలను ఆచరించే వారు, ముఖ్యంగా కార్తీక దీపం చేసే వారు కొన్ని నియమాలను కచ్చితంగా పాటించాలి. అప్పుడే మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. కార్తీక మాసంలో కొన్ని పనులను పొరపాటున కూడా చేయకూడదు. ఒకవేళ మీరు ఏరి కోరి కష్టాలకు స్వాగతం పలికినట్టే. ఈ సందర్భంగా కార్తీక మాసంలో ఎలాంటి పనులు చేయకూడదనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం…

తులసి మొక్కలను తెంచరాదు..
కార్తీక మాసంలో తులసి పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇదే మాసంలో శుక్ల పక్షంలోని ఏకాదశి రోజున తులసి కళ్యాణం నిర్వహిస్తారు. కాబట్టి ఈ సమయంలో తులసిని పూజించడం వల్ల జీవితంలో సంతోషం, శ్రేయస్సు లభిస్తాయి. అలాగే భయాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ మాసంలో తులసి మొక్కలను తెంచరాదు.

 

​మూడు పూటల ఆహారం తీసుకోకూడదు..
కార్తీక మాసంలోని వ్రతాలను ఆచరించేవారు మూడు పూటల భోజనం చేయకూడదు. కేవలం ఒకసారి మాత్రమే భోజనం చేయాలి. మిగిలిన సమయంలో పాలు లేదా పండ్లను మాత్రమే తీసుకోవాలి. ఇంట్లో నిద్రించే సమయంలో బెడ్ పై పడుకోకూడదు. కేవలం నేలపైనే పడుకోవాలి. సూర్యోదయం తర్వాత స్నానం చేయకూడదు. సూర్యోదయానికి ముందే స్నానాన్ని ముగించాలి. అలాగే మద్యం, మాంసాహారం వంటి వాటి జోలికి పొరపాటున కూడా వెళ్లకూడదు.

 

​ఒక దీపం ఇవ్వొద్దు..
కార్తీక మాసంలో దీపదానం శుభప్రదంగా పరిగణించబడుతుంది. అయితే మీరు దీపాలను దానం చేసేటప్పుడు ఒక దీపాన్ని మాత్రం దానం ఇవ్వకూడదు. మీరు ఎవ్వరికైనా దీపాలను దానంగా ఇవ్వాలనుకుంటే కనీసం రెండు దీపాలలో కుంకుమ, పసుపు, నెయ్యి వేసి దానంగా ఇవ్వాలి. ఈ వివరాలన్నీ మత గ్రంథాలలో ప్రస్తావించబడ్డాయి.

​వన భోజనాలను అక్కడే చేయాలి..
ఉసిరికాయను ఆయుర్వేద శాస్త్రంలో ఒక శక్తివంతమైన ఔషధంగా పరిగణిస్తారు. ఆధ్యాత్మిక పరంగా కూడా ఉసిరికాయకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉసిరికాయ చెట్టును లక్ష్మీ, పరమేశ్వరుడు, విష్ణువులకు ప్రతీకగా భావిస్తారు. అందుకే ఈ నెలలో ఉసిరి చెట్టు కింద వన భోజనాలను చేస్తారు. ఇలా చేయడం వల్ల భగవంతుని ఆశీస్సులు లభించడమే కాదు.. ఆరోగ్యకరంగా ఉంటుందని చాలా మంది నమ్ముతారు.

Share This Article
Leave a comment