టాలీవుడ్‌లో కలకలం… మహేశ్‌బాబుకు కరోనా

Telugu Box Office

సూపర్ స్టార్ మహేష్ బాబు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా ద్వారా నిర్థారించారు. ‘‘నాకు కరోనా వైరస్‌ సోకినట్టు నిర్థారణ అయింది. కొద్దిపాటి లక్షణాలు కనిపించాయి. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉంటూ వైద్యుల సూచన మేరకు చికిత్స, స్వీయ రక్షణ చర్యలు తీసుకుంటున్నాను. దయచేసి నాతో కాంటాక్ట్ అయినవారంతా పరీక్ష చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఎవరైతే వ్యాక్సినేషన్ తీసుకోలేదో వెంటనే తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల చాలా వరకు ప్రమాదకరమైన పరిస్థితి నుండి బయటపడవచ్చు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ఉండండి’’ అని మహేష్ బాబు పేర్కొన్నారు.

చివరిగా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కార్ వారి పాట అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది. అయితే RRR సినిమాను సంక్రాంతికి విడుదల చేయడం కోసం రాజమౌళి… మహేష్ బాబు సహా సినిమా టీం మొత్తాన్ని సంప్రదించడంతో ఈ సినిమాని ఏప్రిల్ నెలకు వాయిదా వేశారు. దీంతో కాస్త సమయం దొరకడంతో మహేష్ బాబు చాలా కాలంగా తన కాలి నొప్పితో బాధపడుతున్న క్రమంలో దానికి సర్జరీ చేయించుకున్నారు. కాలు నొప్పి తో బాధపడుతున్న ఆయన స్పెయిన్లో సర్జరీ చేయించుకుని దుబాయ్ లో తన వదిన ఇంట్లో రెస్ట్ తీసుకోవడం కోసం కుటుంబంతో సహా దుబాయ్ వెళ్లారు. కొంత కాలం పాటు దుబాయ్ లోనే ఉండి క్రిస్మస్ నూతన సంవత్సర వేడుకలు అక్కడే జరుపుకున్న మహేష్ బాబు కుటుంబం తాజాగా హైదరాబాద్ కు వచ్చింది.

Share This Article