శబరిమల అయ్యప్ప 18 మెట్లు వెనుక అసలు రహస్యం ఇదే!

Telugu BOX Office

సాధారణంగా హిందూ దేవాలయాలన్నీ ప్రతి రోజూ తెల్లవారుజాము నుంచే తెరచుకుంటాయి. కానీ శబరిమల ఆలయంలోని అయ్యప్ప స్వామి దేవాలయం మాత్రం సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే తెరచుకుంటుంది. ఈ సమయంలోనే స్వామి వారిని దర్శించుకునే వీలు కలుగుతుంది. ఇదిలా ఉండగా అయ్యప్ప స్వామి ఆలయంలో బంగారంతో చేసిన మెట్లు 18 మాత్రమే ఉంటాయి. ఎందుకని సరిగ్గా ఆ సంఖ్యలోనే ఉంటాయి.. అందుకు గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం…

ఒక్కో మెట్టుకు ఉన్న ప్రత్యేకతలేంటో తెలుసా…

​18 దేవతా రూపాలు.
అయ్యప్ప స్వామి ఆలయంలో ఉన్న 18 స్వర్ణ మెట్లను ‘పదునెట్టాంబడి’ అంటారు. ఈ సోపానాల మీదుగా వెళ్లేందుకు ప్రతి ఒక్కరూ అయ్యప్ప మాలను విధిగా 41 రోజుల పాటు ధరించి, మండల దీక్ష చేపట్టి ఇరుముడిని తలపై పెట్టుకుని రావాలి. పురాణాల ప్రకారం, అయ్యప్ప స్వామి శబరిలో నివాసం ఉండేందుకు నాలుగు వేదాలు, రెండు శాస్త్రాలు, అష్టదిగ్పాలకులు, విద్య, అవిద్య, జ్ఞానం అనే దేవతా రూపాలు 18 మెట్లుగా మారారు. అప్పుడు అయ్యప్ప స్వామి వారు ఒక్కో మెట్టుపై ఒక్కో అడుగేస్తూ తన స్థానాన్ని అధిష్టించారు.

అష్టాదశ దేవతలెవరంటే..
1) మహంకాళి 2) కళింకాళి 3) భైరవ 4) సుబ్రహ్మణ్యం 5) గంధర్వరాజ 6) కార్తవీర్య 7) క్రిష్ణ పింగళ 8) భేతాళ 9) మహిషాసుర మర్దని 10) నాగరాజ 11) రేణుకా పరమేశ్వరి 12) హిడింబ 13) కర్ణ వైశాఖ 14) అన్నపూర్ణేశ్వరి, 15) పుళిందిని 16) స్వప్న వారాహి 17) ప్రత్యంగళి 18) నాగ యక్షిణి

18 మెట్ల ప్రత్యేకతలు..
ఈ 18 మెట్లలో తొలి ఐదు మెట్లను పంచేంద్రియాలుగా పరిగణిస్తారు. అంటే మన కళ్లు, చెవులు, నాలుక, ముక్కు, స్పర్శలకు సంకేతాలుగా భావిస్తారు. ఆ తర్వాతి ఎనిమిది మెట్లను అష్ట రాగాలకు సంకేతంగా పరిగణిస్తారు. అంటే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాస్తర్యం, అసూయ, దంబంను సూచిస్తాయని పండితులు చెబుతారు. ఈ అష్టరాగాల ద్వారా ప్రతి ఒక్క మానవుడు అహంకారాన్ని విడనాడి, స్వార్థాన్ని వదిలేయాలి. భగవంతుడిని తలచుకుంటూ తప్పుడు మార్గంలో వెళ్తున్న వారిని సన్మార్గంలో వెళ్లమని సూచిస్తాయి.

​చివరి మూడు మెట్లు..
అయ్యప్ప స్వామి ఆలయంలోని చివరి మూడు మెట్లు సత్వం, తామసం, రాజసాన్ని సూచిస్తాయి. ఈ త్రిగుణాలతో బద్ధకాన్ని వదిలేయాలట. ఆ తర్వాతి రెండు మెట్లు అవిద్యను సూచిస్తాయి. విద్య అంటే జ్ఞానం. మనందం జ్ఞానాన్ని పొందడానికి అవిద్యను అంటే అహంకారాన్ని వదిలిపెట్టాలనే సంకేతాలను సూచిస్తుంది. ఇలా 18 మెట్లు ఎక్కిన వారు జీవితంలో పరిపూర్ణులవుతారని చాలా మంది నమ్ముతారు.

మణికంఠుని ​18 అస్త్రాలిలా..
మణికంఠుడు తన మెట్ల దగ్గర 18 అస్త్రాలను వదిలి వెళ్లాడని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఆ అస్త్రాల పేర్లిలా ఉన్నాయి.
1) శరం 2) క్షురిక 3) డమరుకం 4)కౌమోదకం 5) పాంచజన్యం 6) నాగాస్త్రం 7)హలాయుధం 8) వజ్రాయుధం 9) సుదర్శనం 10) దంతాయుధం 11)నఖాయుధం 12) వరుణాయుధం 13) వాయువ్యాస్త్రం 14) శార్ఘ్నాయుధం 15) బ్రహ్మాస్త్రం 16) పాశుపతాస్త్రం 17) శూలాయుధం 18) త్రిశూలం.

18 మెట్ల నామకరణం ఇలా..
అయ్యప్ప ఆలయంలో ఉండే స్వర్ణ, వెండి, రాగి, ఇత్తడి పంచమ లోహాల మెట్లలో ఒక్కో మెట్టుకు ఒక్కో పేరు ఉంది. అవేంటంటే…
1) ఆణిమ 2) లఘిమ 3) మహిమ 4) ఈశ్వత 5) వశ్యత 6) ప్రాకామ్య 7) బుద్ధి 8) ఇచ్ఛ 9)ప్రాప్తి 10)సర్వకామ 11) సర్వ సంపత్కర 12) సర్వ ప్రియకర 13) సర్వమంగళాకార 14) సర్వ దుఃఖ విమోచన 15) సర్వ మృత్యుప్రశమన 16) సర్వ విఘ్ననివారణ 17) సర్వాంగ సుందర 18) సర్వ సౌభాగ్యదాయక.

18 కొండల పేర్లు ఇలా..
అయ్యప్ప స్వామి ఆలయాన్ని చేరుకోవాలన్న కూడా 18 కొండలను దాటాల్సి ఉంటుంది. అంటే మణికంఠుడు 18 కొండలను దాటొచ్చిన వారికే తన దర్శన భాగ్యం ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా 18 కొండల పేర్లేంటో తెలుసుకుందాం. 1) పొన్నాంబళమేడు 2) గౌదవమల 3) నాగమల 4) సుందరమల 5) చిట్టంబలమల 6) దైలాదుమల 7) శ్రీపాదమల 8) ఖలిగిమల 9) మాతంగమల 10) దేవరమల 11)నీల్కల్ మల 12) దాలప్పార్ మల 13) నీలిమల 14) కరిమల 15) పుత్తుశేరిమల 16) కాళైకట్టి మల 17) ఇంజప్పార మల 18) శబరిమల

ఈ కొండలు మనలో ఉండే లక్షణాలు, ఉండకూడని దుర్గణాలన్నింటికీ సంకేతంగా పండితులు చెబుతారు. అందుకే 18 కొండలు, 18 మెట్లను ఎక్కిన వారికి మాత్రమే అయ్యప్పస్వామి దర్శనభాగ్యం కలుగుతుంది.

Share This Article
Leave a comment