రాధాకృష్ణుల‌ ప్రేమమందిరం!

Telugu Box Office

ప్రధాన దైవం: సీత రాముడు మరియు రాధ కృష్ణ ఇందు దైవాలుగా కొలువ‌బ‌డుతున్నారు. వాస్తు శిల్ప శైలి రాజస్థానీ నిర్మాణశైలి,సోమనాథ్ నిర్మాణశైలిలో అత్యంత వైభ‌వంగా నిర్మిత‌మైన‌ది. ప్రేమమందిరం ప్రసిద్ధ హిందూపుణ్యక్షేత్రం. ఇది భారతదేశంలోని మధుర లోని బృందావనంకు సమీపంలో 54 ఎకరాల విస్తీర్ణంలో గల ఆధ్యాత్మిక కేంద్రం. ఈ దేవాలయం శ్రీకృష్ణ దేవాలయాలలో నవీనమైనది. ఈ దేవాలయ నిర్మాణం ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు అయిన “క్రిపాలు మహారాజ్” చే స్థాపించబడింది.
ఆల‌య‌విశేషాలు
ఈ దేవాలయ ప్రధాన నిర్మాణం చలువరాతితో తయారై అందంగా కనిపిస్తుంది. ఈ కట్టడం సనాతన ధర్మం యొక్క నిజమైన ప్రతిబింబంగా కనిపిస్తుంది. ఈ దేవాలయం నలువైపులా శ్రీకృష్ణుడు మరియు అతని అనుయాయులతో కూడిన ముఖ్య ఘట్టాలు చిత్రీకరించబడ్డాయి. ఈ దేవాలయ శంకుస్థాపన జనవరి 2001 లో “క్రిపాలు మహరాజ్” అనే ఆధ్యాత్మిక గురువుచే చేయబడింది. ఈ దేవాలయ ప్రారంభోత్సవ వేడుకలు ఫిబ్రవరి 17 2012 న జరిగినవి. ఈ దేవాలయం ప్రజల దర్శనార్థం ఫిబ్రవరి 17 నుండి ప్రారంభించబడింది. ఈ దేవాలయ నిర్మాణ ఖర్చు 150 కోట్లు ($23 మిలియన్లు) అయినది. ఈ దేవాలయ ప్రధాన దైవం రాధా గోవింద (రాధా కృష్ణ) మరియు శ్రీ సీతారాములు కొల‌బ‌డుతున్నారు. 73,000 చదవపు అడుగులు, చిన్న పిల్లరు, గోపురం ఆకారంలో గల సత్సంగ భవనం కూడా ప్రేమమందిరం నిర్మాణం తరువాత నిర్మింపబడుతున్నది. ఈ సత్సంగ భవనంలో ఒకేసారి 25,000 మంది ప్రజలు ప్రార్థనలు చేసుకొనే వీలుండే కైవారంతో నిర్మిత‌మైన‌ది.
నిర్మాణం
ఈ బృందావన ప్రాంతం ప్రముఖ ఆధ్యాత్మిక గురువు అయిన “కృపాలు మహారాజ్” చే అభివృద్ధి చేయబడింది. ఈయన ప్రధాన ఆశ్రమం కూడా బృందావనం లోనే ఉంది. ఈ దేవాలయ నిర్మాణ పనులు 14 జనవరి 2001 మొదలుపెట్టడం జరిగింది. దీని నిర్మాణంలో 800 మంది కళాకారులు,నైపుణ్యముగల పనివారు మరియు నిపుణులు పాలుపంచుకున్నారు. వీరు దేశంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చి రాత్రి,పగలు నిరంతరం కృషి చేసి అసలైన సోమనాథ్ దేవాలయం శైలిలోనే పూర్తిగా మార్బుల్స్ తో నిర్మాణం చేశారు. ఈ నిర్మాణానికి సుమారు 11 సంవత్సరాలు పట్టింది. దీనికయ్యే ఖర్చు 150 కోట్లు.
దీని నిర్మాణానికి 30,000 టన్నుల ఇటాలియన్ మార్బుల్స్ వాడిరి. దీని నిర్మాణం కోసం మార్బుల్స్ చెక్కుటకు ప్రత్యేకంగా కూకా రోబోటిక్ యంత్రాలను వాడారు. ఈ దేవాలయం పొడవు 122 అడుగులు మరియు వెడల్పు 115 అడుగులు. దక్షిణ భారతదేశ సంస్కృతి ప్రభావం ఈ దేవాలయ నిర్మాణంలో కనిపిస్తుంది. ఈ దేవాలయ ప్లాను మరియు డిసైనింగ్ పనులు గుజరాత్ కు చెందిన సుమన్ మరియు మనోజ్ భాయి సోంపురా లచే చేయబడింది. ఇది మందమైన గోడలు, స్వచ్ఛమైన మార్బుల్స్ కలిగిన భారీ మార్బుల్ నిర్మాణం. ఈ దేవాలయ ప్రధాన దేవతలు రాధాకృష్ణులు.
ఆలయంలో జ‌రిగే నిత్య‌పూజ‌లు
ఉ. 6.30 : భోగం మరియు ప్రధాన మందిరం తలుపుల మూసివేత.
ఉ. 8.30 : దర్శనం మరియు ఆర్తి
ఉ. 11.30 : భోగం.
మ. 12.00 : శయన ఆర్తి గూర్చి తలుపుల మూసివేత.
సా.4.30 : ఆర్తి మరియు దర్శనం
రా. 8.00 : శయన ఆర్తి
రా. 8.30 : తలుపుల మూసివేత.
అక్క‌డ ప్ర‌శాంత‌త‌కు పెట్టింది పేరు . జీవితంలో ఒక్క‌సారి ఈ బృందావ‌నాన్ని వీక్షించిన‌వారిదే జ‌న్మధ‌న్యం. …..

Share This Article