ఒక్క పాట కోసం రూ.30కోట్లా.. శంకర్‌తో మామూలుగా ఉండదు మరి!

Telugu BOX Office

విశ్వనాయకుడు కమల్‌ హాసన్‌, అగ్ర దర్శకుడు శంకర్‌ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇండియన్‌ 2’. 27 ఏళ్ల క్రితం వచ్చిన ‘భారతీయుడు’ సినిమాకు ఈ సినిమా సీక్వెల్‌గా రూపొందుతుంది. సినిమా ప్రారంభమై ఆరేళ్లు కావొస్తున్నా పలు కారణాల వల్ల షూటింగ్‌ వాయిదా పడుతూ వచ్చింది. కొన్నాళ్లకు మళ్లీ షూటింగ్‌ మొదలుపెట్టారు. ప్రస్తుతం రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఇటీవలే ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను మేకర్స్‌ ప్రకటించారు. ఇప్పుడు ఈ చిత్రం గురించి మరో ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ చక్కర్లు కొడుతోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇండియన్‌-2, దీపావళికి ఇండియన్-3 చిత్రం విడుదల చేయాలని మేకర్స్‌ భావిస్తున్నారని టాక్‌ నడుస్తోంది. అయితే శంకర్‌ అటు రామ్‌ చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమాతోపాటు ‘భారతీయుడు-2’ సినిమాకు పని చేయాల్సి రావడంతో రెండు సినిమాల షూటింగులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే ఇలాంటి రిపీట్‌ కాకుండా త్వరగా సినిమా విడుదల చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.

శంకర్‌ సినిమా అంటే భారీతనం తప్పనిసరి. భారీ సెట్స్‌, గ్రాండ్‌గా పాటల చిత్రీకరణ ఉంటుంది. తాజాగా ఓ పాట చిత్రీకరణ కోసం ఏకంగా 30 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. కమల్‌ 30 కోట్ల బడ్జెట్‌తో వేసిన సెట్స్‌పై పాటను రూపొందించాలని ప్లాన్‌ చేస్తున్నామని యూనిట్‌ తెలిపింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. ఎస్‌జే సూర్య, బాబీ సింహా, సిద్దార్థ్‌, మధుబాల, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కీలక పాత్రధారులు. లైకా ప్రొడక్షన్స్‌ -రెడ్‌ జియాంట్‌ మూవీస్‌పై ఉదయనిధి స్టాలిన్-సుభాస్కరన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనిరుద్‌ రవిచందర్‌ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.

Share This Article
Leave a comment