సిద్ధి వినాయక దేవాలయం !

Telugu Box Office

సిద్ధి వినాయక దేవాలయం మహారాష్ట్ర లోని ముంబయి లోని ప్రభావతి ప్రాంతంలో ఉంది. దీనికి రెండు శతాబ్దాలకు పైగా చరిత్ర ఉంది. పిలిస్తే ప‌లికే స్వామిగా భ‌క్తుల‌తో కొలువ‌బ‌డుచున్న‌ది. ఈ దేవాలయంలో ప్రధాన దైవం వినాయకుడు. ఈ దేవాలయం నవంబరు 19,1801 లో లక్ష్మణ్ వితు అంరియు దూబాయ్ పాటిల్ చే నిర్మించబడింది. ఇది ముంబైలోని అతి ఐశ్వర్యవంతమైన, అత్యంత ఖ‌రీదైన దేవాలయంగా గుర్తింప‌బ‌డింది.ఈ ఆలయానికి పర్వదినాలలో భక్తుల తాకిడి చాలా ఎక్కువగానే ఉంటుంది.

మంగళ వారం నాడు సుమారు ల‌క్ష‌మందికి పైగా, భక్తులు, కోరిక‌లు నెర‌వెరేందుకు మొక్కుకున్న‌భ‌క్తులు భ‌క్తిపూర్వ‌కంగా స్వామిని ద‌ర్శింప‌ వస్తుంటారు. ఈ ఆలయానికి ఫిక్స్‌డ్ డిపాజిట్లు రూపంలో నూట యాబై కోట్ల రూపాయలు వ‌ర‌కు ఉన్నాయి. ప్రతి ఏటా కానుకల రూపంలో పది కోట్లకు పైగా వస్తుంటుంది. ఈ ఆలయ సంపద విలువ మూడు వందల యాబై కోట్ల రూపాయలు పైగానే ఉంది. 1801 సంవత్సరంలో చిన్న ఆలయంగా ప్రారంభమైన ఈ గుడి కాల క్రమంలో ఆరు అంతస్తులతో ఉంది. ఆలయ శిఖర గోపురానికి బంగారు తాపడం చేయించారు. ఆగ్రిసమాజ్ కు చెందిన దూబె పాటిల్ అనే శ్రీమంతురాలు ఈ ఆలయాన్ని కట్టించింది.

పిల్లలు కలగని మహిళలు ఈ స్వామి వారిని దర్శిస్తే పిల్లలు కలుగుతారని భక్తుల విశ్వాసము. ఈ ఆలయంలో వినాయకుని ఎత్తు 2.6 అడుగులు. వినాయకుని తొండం కుడివైపుకు తిరిగి వుండడము ఈ ఆలయం ప్రత్యేకత. ఒకచేతిలో కమలం, ఒక చేతిలో గొడ్డలి, ఒక చేతిలో తావళం, ఒక చేతిలో కుడుములు ఉన్న పాత్ర ఉన్నాయి. ప్రముఖ వ్వాపార వేత్తలు, సినీ ప్రముఖులు ఈ ఆలయాన్ని దర్శిస్తుండటంతో ఈ ఆలయానికి అత్యంత ప్రాధాన్యత వచ్చింది. ఈ దేవాలయం గోపురం లోపలి భాగంలోని పైకప్పు కూడా బంగారంతో తాపడం చేయడం జరిగింది.

చరిత్ర

ఈ దేవాలయం నబంబరు 19 1801 న నిర్మించబడింది. దీని వాస్తవ నిర్మాణం చాలా చిన్నదిగా 3.6మీ x 3.6 మీ కొలతలుగా ఉన్న చతురస్రాకార స్థలంలో శిఖరాన్ని కలిగి యుండే నిర్మాణంగా యుండెడిది. ఈ దేవాలయం లక్ష్మణ్ వితుల్ పాటిల్ అనే కాంట్రాక్టరుచే నిర్మించబడింది. ఈ దేవాలయానికి నిధులను ధనవంతురాలైన అగ్రి మహిళ అయిన దెబాయ్ పాటిల్ చే సమకూర్చబడినవి. ఆమెకు సంతానం లేరు.సంతానం కోస‌మే ఆమె ఈగుడి నిర్మాణానికి పూనుకున్నార‌నే క‌థ‌నాలు వినిపిస్తాయి . ముంబాయ్ వెళ్లిన వారిలో హిందువులు
త‌ప్ప‌క ఈ ఆల‌యం ద‌ర్శించాల‌ని త‌పిస్తారు. అయితే అక్క‌డ‌కి వెళ్లాక ఎంతో ఆహ్లాదాన్ని పొందుతారు.

Share This Article