సేవామూర్తి శ్రీనివాస్‌రెడ్డి.. రాజకీయాలే కాదు సామాజిక సేవలోనూ దూకుడే

Telugu BOX Office

రాడికల్ బయో ఆర్గానిక్ లిమిటెడ్(ఆర్బీఎల్) ప్రతినిధి, తాండూరు కాంగ్రెస్ పార్టీ నేత బి. శ్రీనివాస్‌రెడ్డి రాజకీయాలతో పాటు సామాజిక సేవలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలతో ప్రజల మన్ననలు పొందుతున్న ఆయన తాజాగా తాండూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో రూ.92వేలు ఖర్చు చేసి బోరును వేయించారు. కాలేజీలో నీళ్ల సమస్య ఉందని తెలుసుకున్న శ్రీనివాస్‌రెడ్డి స్పందించి  తన సొంత ఖర్చులతో బోరు వేయించారు. దీంతో కాలేజీ అధ్యాపకులు, విద్యార్థులు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ… ప్రభుత్వ విద్యాలయాల్లో చదివే విద్యార్థుల సమస్యలు పరిష్కరించేందుకు తాను కృషి చేస్తున్నట్లు తెలిపారు. పట్టణంలోని విజయ విద్యాలయ పాఠశాలలో మౌలిక సదుపాయాలకు రూ.లక్షన్నర నిధులు, యాలాలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అదనపు గదుల నిర్మాణానికి రూ.30లక్షల నిధులు సమకూర్చామని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌రెడ్డిని తాండూరు ఎంఈవో వెంకటయ్య గౌడ్ అభినందించారు.

 

తాండూరు కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తోన్న శ్రీనివాస్‌రెడ్డి నియోజకవర్గంలో ఎవరు ఏ కష్టంలో ఉన్నా తానున్నానంటూ ముందుకొస్తుంటారు. తరుచూ గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలతో మమేకమై వారి సమస్యలపై ఆరా తీయడమే కాకుంగా వారి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఎవరు ఏ సాయం అడిగినా కాదనకుండా తనవంతుగా అండగా నిలుస్తున్నారాయన.

Share This Article
Leave a comment