శంభులింగేశ్వర స్వామి దేవాలయం!

Telugu Box Office

కాకతీయుల కాలం నాటి ఈ చారిత్రక శివాలయం అనేకానేక‌మైన విశిష్ట‌త‌లు క‌లిగిన ప్రత్యేకమైన ఆల‌యంగా భ‌క్తులు చెబుతుంటారు.కాక‌తీయులు శిల్ప‌క‌ళ‌ల‌ను ప్య‌త్యేకంగా తాము నిర్మించే ఆల‌యాల‌లో ఆప‌ని త‌నాన్ని శిల్పుల‌తో చూపించేలా గుడులు గోపురాలు నిర్మాణాలు సాగించారు. వారితో ఏగుడి నిర్మాణం జ‌రిగిన పెక్కు విశిష్ట‌త‌ల‌తో గొప్ప‌గా రాణించేవి.

ఆలయ విశేషాలు

ఇక్కడి స్వయంభూ శివలింగం(1.83 మీటర్ల ఎత్తు 0.34 మీ చుట్టు కొలత కలిగి ప్రతి సంవత్సరం ఎత్తు పెరుగుతూ ఉంటుంది. ఈ ఆలయం నల్లగొండజిల్లా కోదాడ దగ్గరలో మేళ్ళచెరువులో ఉంది. జాతీయరహదారి నుండి కేవలం పది కి.మీ. లోపు ఉండే ఈదేవాల‌యాన్ని చేరుకోవచ్చు. 11వ శతాబ్ధంలో యాదవరాజులు దేవాలయాన్ని నిర్మించారని చారిత్ర‌క ఆధారాలున్నాయి. నిత్యం స్వయం అభిషేకం జరుగుతుంటుంది…శివలింగం పెరిగే ఎత్తు ఒక ఎత్తయితే ప్రతి అడుగు ఎత్తు తర్వాత ఒక వలయం ఏర్పడుతూ ఉంటుంది.. ఆ విధంగా చూస్తే మనకు కొన్ని సంవత్సరాల తర్వాత వలయాల సంఖ్యలో పెరుగుదల మనకు స్పష్టంగా కనపడుతుంది.

మొదట్లో కేవలం మూడు నామములు పెట్టే స్థలమే ఉండేదట. ప్రస్తుతం ఆరు నామములు పెట్టేంత స్థలం ఏర్పడిందని ఆలయ అర్చకులు.. ఈప్రాంతం పూర్వీకులు చెపుతుంటారు. ఇంకొక విచిత్రమేమిటంటే ఈ శివలింగం పై భాగంలో చిన్న ఖాళీ ప్రదేశముంది.. ఇక్కడ ఎప్పుడూ నీరు ఊరుతూ ఉంటుంది.. ఈ నీరు విగ్రహంపై అభిషేకంలా ఎప్పుడూ ఉబుకుతుంది… అంటే శివుని ఝటాఝూటంలోని గంగమ్మ వారిలా… అందుకే ఇది స్వయం అభిషేక లింగంగా చెబుతుంటారు. ఇది ఈ క్షేత్రంలో చాలా ప్రత్యేకం.. ఈ నీరు ఎంత తీసివేసినా తిరిగి తిరిగి ఊరుతూనే ఉంటుంది…

ఇక్కడ శాస్త్రీయమైన ఏ ఆధారాలు లేవు… కానీ ఇది ఒక అద్భుతం… శివుని ఝటాఝూటంలో గంగా దేవి లాగా శివుని అభిషేకం చేయటం అద్భుతమే కదా… మన భారతదేశంలో కేవలం వారణాసి లో మాత్రమే ఇలా ఉందట.. అందుకే దీనిని దక్షిణ కాశీ అని కూడా ఇక్కడ పిలుస్తారు…కాకతీయుల కాలంలో ఒక ఆవు ప్రతిరోజూ వచ్చి ఈ శివలింగానికి క్షీరాభిషేకం చేసేదట… ఆ యాదవ కాపరి ఆ రాయిని శివలింగం అని తెలియక పదకుండు ముక్కలుగా చేసి వేర్వేరు ప్రదేశాలలో పారవేస్తాడట…

కానీ తిరిగి రెండవ రోజు చూస్తే మరల అక్కడ ఈ లింగం ప్రత్యక్షమై కనిపించిందట… అతనికి ఏమీ అర్థంకాక రాజుగారికి చెపితే ఆయన దీనిని శివలింగం గా గుర్తించి ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం వేయి సంవత్సరాల చరిత్ర ఉన్నదిగా చెపుతారు…ఇక్కడ శివరాత్రి మహోత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయి.. శివ కళ్యాణమును లక్షదీపారాధనలను చాలా కన్నుల పండువగా నిర్వహిస్తారు…

Share This Article