పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన అంతర్జాతీయ నిపుణులు

Telugu BOX Office

ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు సర్కారు ఫోకస్ పెట్టింది. ప్రాజెక్టు స్థితిగతులపై ఇప్పటికే శ్వేతపత్రం విడుదల చేయగా.. తాజాగా అంతర్జాతీయ నిపుణుల బృందం ఆదివారం ఉదయం పోలవరం ప్రాజెక్టును సందర్శించింది. ఈ బృందంలో అమెరికాకు చెందిన డేవిడ్ పి పాల్, గెయిన్ ఫ్రాంకో డి సిక్కో, కెనడాకు చెందిన రిచర్డ్ డానెల్లీ, సీన్ హించ్ బెర్గర్‌ ఉన్నారు. వీరు డయాఫ్రం వాల్, స్పిల్ వే వంటి ప్రధాన నిర్మాణాలతో పాటు ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను పరిశీలించి అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఈ బృందం నాలుగు రోజుల పాటు ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో పర్యటించనుంది. అనంతరం ప్రాజెక్టు పనుల పరిస్థితిపై నివేదిక ఇస్తారు. ఈ నివేదికను బట్టే పనులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంట‌నే చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సంగతి తెలిసిందే. వరదలకు దెబ్బ తిన్న రిటర్నింగ్‌ వాల్‌తో పాటు, కాఫర్‌ డ్యాం, గైండ్‌ బండ్‌ను పరిశీలించారు. జ‌గ‌న్ ప్రభుత్వం పోలవరంను నాశనం చేసిందని విమర్శించారు. అనంతరం పోలవరంపై శ్వేత పత్రం విడుదల చేశారు. తిరిగి ప్రాజెక్ట్‌ పనులను ఎలా ప్రారంభించాలి అనే దానిపై నిపుణుల బృందాన్ని నియమించారు.

Share This Article
Leave a comment