‘మాయ బజార్’ సినిమాలో నటించిన ఈయన బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?

Telugu BOX Office

‘మాయ బజార్ (1957)’… తెలుగు సినిమా గురించి ప్రస్తావన వస్తే ముందుగా మాట్లాడుకునేది ఈ సినిమా గురించే. బ్లాక్ అండ్ వైట్ కాలంలోః బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన ఈ మూవీని కలర్స్‌లో రీ రిలీజ్ చేస్తే మళ్లీ 100 రోజులు ఆడింది. తరాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ అలరిస్తోంది ఈ చిత్ర రాజం. ఇందులో ప్రతీ సీన్ అద్భతంగా తీర్చిదిద్దారు డైరెక్టర్ కేవీ రెడ్డి. నాగిరెడ్డి, చక్రపాణి నిర్మాతలు. ప్రతి పాత్రను హైలెట్ చేస్తూ వారికి ప్రాధాన్యత ఇచ్చారు.

ఈ సినిమాలో ఓ మాయ కృష్ణుడిగా ఓ వృద్ధుడు కనిపిస్తాడు. ఘటోత్కచుడు రాగానే తనను పైకి లేపితేనే లోనికి వెళ్లనిస్తానని సవాల్ విసురుతాడు. కానీ ఘటోత్కచుడు ఎంత ప్రయత్నించినా అతడిని పైకి లేపలేకపోడాడు. అప్పుడు కృష్ణుడు తన అసలు రూపంలోకి రావడంతో ఘటోత్కచుడు నమస్కరిస్తాడు. అయితే మాయా కృష్ణుడిగా కనిపించిన వ్యక్తి గురించి తెలిస్తే ఆశ్చర్యపోక మానరు.

‘చిన మాయ పెదమాయ.. పెదమాయ పెనుమాయ.. అటు స్వాహా.. ఇటు స్వాహ.. ఎరుగకుండ వచ్చావు.. ఎరుకలేకపోతావు.. ఇదే వేదం.. ఇదే వేదం.. చిరంజీవ చిరంజీవ.’ అంటూ పద్యం పాడే ఆయన పేరు కంచి నరసింహారావు. 1934 నుంచే ఆ సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు. 1935లోవచ్చిన ‘హరిశ్చంద్ర’ సినిమాలో ఆయన కాల కౌశికుడిగా నటించారు. ఆ తరువాత ఏవీఎం వారు తీసిన ‘జీవితం’ అనే సినిమాలో నటించారు. 1955లో వచ్చిన దొంగరాముడు చిత్రంలోనూ కనిపిస్తారు.

1957 మార్చి 27న రిలీజ్ అయిన మాయాబజార్ అందరినీ ఆకట్టుకుంది. ఇందులో ఎన్టీరామారావు, అక్కినేని నాగేశ్వర్ రావు, సావిత్రి, రేలంగి నరసింహారావు, ఎస్వీ రంగారావు, గుమ్మడి తదితరులందూ నటించి సినిమాకు ప్రాణం పోశారు. పాండవులు, కౌరవుల మధ్య వచ్చే మనస్పర్థలు ఎలా ఉంటాయి? అనే కథను బేస్ చేసుకొని తీసిన ఈ సినిమాలో సావిత్రి నటనా అత్యంత గొప్పగా కనిపిస్తుంది. ఇక ఇందులో ఓ ఆసక్తికర సన్నివేశం ఉంటుంది. సావిత్రిని తీసుకెళ్లేందుకు వచ్చిన ఘటోత్కచుడికి కృష్ణుడు సాయం చేస్తాడు. అయితే అంతకుముందు అతనికి ఓ పరీక్ష పెడుతాడు. ఆ పరీక్షలో భాగంగా ఓ వృద్ధుడిలా కనిపిస్తాడు. ఆ పాత్రలో నటించారు కంచి నరసింహారావు గారు. ఈ చిత్రం వచ్చిన ఇన్ని దశాబ్దాలైనా ఎన్టీఆర్, ఏఎన్నార్‌, సావిత్రిలతో పాటు కంచి నరసింహారావు పాత్ర కూడా తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది.

Share This Article
Leave a comment