28 ఏళ్ల తరువాత తొలి హీరోయిన్‌తో పవన్ కళ్యాణ్.. ఫోటో వైరల్

Telugu BOX Office

ఆ ఇద్దరు ఒకే సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. సరిగ్గా 28 ఏళ్లు తిరిగేసరికి.. ఒకరు ఆంధ్ర రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయితే, మరొకరు ప్రముఖ మూవీ నిర్మాతగా మారారు. వారే పవర్ స్టార్ పవన్ కల్యాణ్, యార్లగడ్డ సుప్రియ. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన నిర్మాతలు తమ సమస్యలను తీర్చాలంటూ సోమవారం మధ్యాహ్నం డిప్యూటీ సీఎం పవన్‌తో భేటీ అయ్యారు.

అయితే ఈ భేటీకి అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ప్రతినిధిగా నిర్మాత సుప్రియా యార్లగడ్డ కూడా హాజరయ్యారు. ఇక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. మీటింగ్ ముగిసిన వెంటనే సుప్రియా పవన్‌తో ఫొటో దిగింది. మొదటి సినిమా చేసిన వారిద్దరూ మళ్లీ సినిమాలో నటించలేదు. అయితే ప్రస్తుతం పవన్‌తో సుప్రియా దిగిన ఫొటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ ఫొటో చూసిన ఫాన్స్.. 28 ఏళ్ల తరువాత హీరో హీరోయిన్ మళ్లీ కలిశారంటూ కామెంట్ చేస్తున్నారు.

Share This Article
Leave a comment